న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ను డిసెంబర్ 9వ తేదీన వివాహం చేసుకోనున్నాడు. జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వారణాసికి చెందిన ప్రతిమా సింగ్ భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టుకు మాజీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించింది. అంతేకాదు భారత బాస్కెట్ బాల్ జట్టు తరుపున ఆసియా గేమ్స్తో పాటు పలు జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంది. 'సింగ్ సిస్టర్స్' అంటే భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టులో తెలియని వారుండరంటే నమ్మండి.
ఐదుగురు సిస్టర్స్లో ప్రతిమా సింగ్ చిన్నది. ప్రతిమా సింగ్ సిస్టర్స్ అందరూ మహిళల బాస్కెట్ బాల్ తరుపున పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. కాగా ఇషాంత్ శర్మ, ప్రతిమా సింగ్లది ప్రేమ పెళ్లి కాబోతుండటం విశేషం. బాస్కెట్ బాల్ కోర్టులో ప్రతిమాతో ఇషాంత్కు తొలిపరిచయం ఏర్పడింది.
ప్రతిమా సింగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. ప్రతిమా సింగ్ అక్క ఆకాంక్ష బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడంతో 2011లో ఢిల్లీలో నిర్వహించిన టోర్నీకి ఇషాంత్ శర్మను ఆహ్వానించింది. చీఫ్ గెస్ట్గా అక్కడికి వెళ్లిన ఇషాంత్ ప్రతిమా సింగ్ను అక్కడే చూశాడు. తన ఎత్తుకు మ్యాచ్ అవుతుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు.
అందరు అబ్బాయిల్లాగే ఇషాంత్ కూడా లవ్లో తొందరపడ్డాడు. ప్రతిమను బయటికెళ్తామా అంటూ ఆహ్వానించాడు. అయితే అక్కకు చెప్పకుండా ఏ పనీ చేయని ప్రతిమా ఈ విషయాన్ని ఆకాంక్షతో చెప్పింది. ఆకాంక్షకు ఇషాంత్ ఎలాంటోడో తెలుసు కాబట్టి చెల్లెలి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొదలైన వీరి ప్రేమ కథ చాలా రోజులు నడిచింది.
చివరకు పెళ్లి తర్వాత బాస్కెట్ బాల్ ఆడేందుకు అనుమతివ్వాలన్న ఇషాంత్కు ప్రతిమా సింగ్ కండీషన్ పెట్టింది. ఆటలను ఇష్టపడే ఇషాంత్ ఆమె కోరికకు అడ్డు చెప్పకపోవడంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.