హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్ ప్రాంఛైజీకి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సహా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టీ20 లీగ్లో అడుగుపెడుతున్నాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్వహించనున్న గ్లోబల్ టీ20 లీగ్లో షారుఖ్ ఖాన్ ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు.
ఈ లీగ్లో కేప్టౌన్ నైట్రైడర్స్ ఫ్రాంఛైజీని షారుఖ్ ఖాన్ కొన్నాడు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్మన్ జేపీ డుమినిని ఈ ఫ్రాంఛైజీ ప్రధాన ఆటగాడిగా తీసుకుంది. ఈ లీగ్లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. డర్బన్, బినాని, ప్రిటోరియా, స్టెలెన్బాష్, బ్లూఫాంటైన్, పోర్ట్ ఎలిజబెత్ కేంద్రాలుగా మిగతా ఆరు ఫ్రాంఛైజీలు లీగ్లో పాల్గొంటాయి.
ఈ లీగ్ తొలి సీజన్ నవంబర్-డిసెంబర్లో ఆరంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లను ఆగస్టు 19న వేలం నిర్వహించనున్నారు. కాగా, షారుఖ్కు కరీబియన్ టీ20 లీగ్లోనూ ట్రిన్బాగో నైట్రైడర్స్ పేరుతో ఓ జట్టు ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఢిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్య సంస్థ జీఎంఆర్ గ్రూప్ సైతం గ్లోబల్ టీ20 లీగ్లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. జొహానెస్బర్గ్ కేంద్రంగా నడిచే ఫ్రాంఛైజీని ఈ సంస్ధ కొనుగోలు చేసింది. ఈ ప్రాంఛైజీ పేసర్ రబాడను ప్రధాన ఆటగాడిగా ఎంచుకుంది.
Excited to be the marquee player for the Cape Town Franchise in the @T20GL_ later this year. Great owners in @iamsrk & @VenkyMysore #CTKR pic.twitter.com/I4GHCvRMvq
— JP Duminy (@jpduminy21) June 19, 2017
టీ20 గ్లోబల్ లీగ్లో ప్రాంఛైజీని కొనుగోలు చేయడం పట్ల కోల్కతా నైట్ రైడర్స్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్ మాట్లాడుతూ నైట్ రైడర్స్ బ్రాండ్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడమే తమ లక్ష్యమని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీగ్ అభిమానులకు మద్దతు ఉంటుందని అన్నాడు.
ఇక కేప్ టౌన్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్ సిటీ అని, క్రికెట్ను ఎంతగానో ప్రేమించే అభిమానులు ఉంటారని తెలిపాడు. ఇక షారుక్ ఖాన్ సైతం ఈ లీగ్ పట్ల ఎంతో ఆతృతతో ఉన్నానని చెప్పుకొచ్చాడు.
Spl day in the journey of #KnightRiders. From @KKRiders 2 @TKRiders 2 @T20GL_ #CapeTownKnightRiders. @iamsrk sums it up best. Thnx sir! pic.twitter.com/XqTiKYWfnI
— Venky Mysore (@VenkyMysore) June 19, 2017