హైదరాబాద్: వార్షిక అప్డేట్లో భాగంగా మంగళవారం ఐసీసీ టీ20 ర్యాంకులను ప్రకటించింది. తాజా ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా, టీమిండియా రెండు ర్యాంకులు కోల్పోయి నాలుగో స్ధానంలో నిలిచింది.
ఇక ఈ ఏడాది జూన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్ మూడు స్థానాలు మెరుగు పరుగుకుని రెండో స్థానానికి ఎగబాకింది. 2007లో ఐసీసీ వరల్డ్ టీ20 ఛాంపియన్గా అవతరించిన టీమిండియా 118 పాయింట్లతో నాలుగో స్ధానంలో నిలిచింది.
121 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్ధానంలో నిలవగా, 111 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్ధానంలో, 110 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆరో స్ధానంలో నిలిచాయి. 2019లో వరల్డ్ టీ20 క్వాలిఫయిర్ జరగతుండగా, 2020లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టీ20కి ఆస్ట్రేలియా అతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ టీ20 ర్యాంకులు (మే2, 2017 నాటికి):
(Read as Rank, Change, Team, Points)
1. (-) New Zealand 125 (-2)
2. (+3) England 121 (+7)
3. (+1) Pakistan 121 (+5)
4. (-2) India 118 (-6)
5. (-2) South Africa 111 (-6)
6. (+1) Australia 110 (-)
7. (-1) West Indies 109 (-3)
8. (-) Sri Lanka 95 (-4)
9. (-) Afghanistan 90 (+6)
10. (-) Bangladesh 78 (+4)
11. (-) Scotland 67 (+4)
12. (-) Zimbabwe 65 (+3)
13. (+1) UAE 52 (+4)
14. (-1) Netherlands 49 (-9)
15. (+1) Hong Kong 46 (+3)
16. (-1) Papua New Guinea 39 (-4)
17. (+1) Oman 38 (-1)
18. (-1) Ireland 36 (-4)