హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి టీమిండియా ప్లేయర్స్ ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ టీషర్ట్పై జట్టు ప్లేయర్లంతా సంతకాలు చేసిన దానిని అప్రిదికి పంపించారు.
ఈ గిప్ట్పై విరాట్ కోహ్లీ ఓ సందేశాన్ని కూడా రాశాడు. 'షాహిద్ భాయ్.. బెస్ట్ విషెస్.. నీతో ఆడటం ఎప్పుడూ నాకు సంతోషమే' అని విరాట్ కోహ్లీ ఓ సందేశం రాశాడు. దీనికి సంబంధించిన ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ పైజాన్ లఖానీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
Virat Kohli's shirt, signed by Indian team, for Shahid Afridi, with a message "always a pleasure playing against you." pic.twitter.com/KexlCjTNeZ
— Faizan Lakhani (@faizanlakhani) 15 April 2017
ఆ తర్వాత 2106లో ఐసీసీ వరల్డ్ టీ20లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. చివరకు ఫిబ్రవరి 20, 2017లో టీ20ల నుంచి కూడా వైదొలగుతున్నట్లు అప్రిది ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అప్రిది 27టెస్టులు (1716 పరుగులు), 398 వన్డేలు (8064 పరుగులతో పాటు 395 వికెట్లు), 98 టీ20ల్లో (1405 పరుగులతో పాటు 97 వికెట్లు) తీశాడు.