క్రికెజ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ సంయుక్తంగా తలపెట్టిన ఆల్ స్టార్ ట్వంటీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లకు యునైటెడ్ స్టేట్స్లోని ప్రముఖ బేస్బాల్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ విషయాన్ని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సోమవారం అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు న్యూయార్క్లోని ఫేమస్ యాంకీ స్టేడియంలో ట్వంటీ20 మ్యాచ్ను నిర్వహించనున్నట్లు వార్న్ తెలిపారు.
సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్లు సంయుక్తంగా ఈ ఏడాది అమెరికాలో ట్వంటీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించనున్న గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలోని మూడు బేస్బాస్ స్టేడియాలను బుక్ చేసినట్లు షేన్ వార్న్ పేర్కొన్నాడు.
క్రికెట్ ఆస్టేలియాకు చెందిన వెబ్ సైట్లో సోమవారం ఈ సమాచారాన్ని ఉంచారు. షేన్ వార్న్ బుక్ చేసిన మూడు స్డేడియాలు ఏంటంటే?
వ్రింగ్లీ ఫీల్డ్ - చికాగో
యాంకీ స్టేడియం - న్యూయార్క్
డోగ్జర్ స్టేడియం - లాస్ ఏంజిల్స్
ఈ టోర్నీలో రికీ పాంటింగ్, గ్లేన్ మెక్గ్రాత్, బ్రెట్ లీ, జాక్వెస్ కల్లిస్, ఆడాం గిల్క్రిస్ట్, మైకేల్ వా, ఆండ్రూ ఫ్లింటాఫ్, ఇతర మాజీ ఆటగాళ్లు ఆడనున్నారు. టెండూల్కర్, వార్న్లు ఇప్పటికే 28మంది మాజీ ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపారు. ఈ లీగ్లో ఆడేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలిపాడు.
ఈ ట్వంటీ20 టోర్నీలు అమెరికాలో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. ఈ కొత్త లీగ్లో ఆటగాళ్లకు ప్రతీ మ్యాచులో 25,000 డాలర్లు ఇవ్వనుంది. ఈ లీగ్ కోసం ఇప్పటికే సచిన్ టెండూల్కర్ - షేన్ వార్న్ ఇద్దరూ ఐసీసీని సంప్రదించారు. ఈ లీగ్కు ఐసీసీ ఎలాంటి అభ్యతరం తెలపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది.