న్యూఢిల్లీ: ఇటీవల ప్రపంచ కప్ ట్వంటీ 20ల్లో ఓ మ్యాచ్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఒకే ఓవర్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఇరువురి మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయా? అనే చర్చ జరిగిన విషయం తెలిసిందే.
అయితే, క్లిష్ట పరిస్థితుల్లోను రవిచంద్రన్ అశ్విన్కు ధోనీ అండగా నిలబడిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ మ్యాచులో ఒక ఓవర్ ఇవ్వడం వెనుక.. ధోని గేమ్ ప్లాన్ తప్ప మరొకటి లేదని అంటున్నారు. పరిస్థితిని బట్టి అలా ఇవ్వాల్సి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
అదే సమయంలో, ధోనీ, అశ్విన్ల మధ్య ఏ విభేదాలు లేవని తాజాగా తెలుస్తోంది. తాజాగా ఓ కమర్షియల్ వీడియో రానుంది. ఇందులో ధోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి అశ్విన్ను ఆటపట్టిస్తుంటాడు. అతని హిందీ భాష పరిజ్ఞానం విషయంలో వారిద్దరు అశ్విన్ను ఆట పట్టిస్తారు.
త్వరలో రానున్న సదరు కమర్షియల్ వీడియోలో... అశఅవిన్ పిక్చర్ క్వాలిటీ గురించి అడుగుతాడు. 'యే పిక్చర్ క్వాలిటీ బక్వాస్ హై' అంటాడు. దానికి కోహ్లీ నవ్వుతూ.. 'తేరే హిందీ సే తోహ అచ్చా హై' అని ఆటపట్టిస్తాడు. ధోనీ వంత పాడుతాడు. మరో క్లిప్లో ధోనీ 'భూల్ గయా డైలాగ్' అంటాడు.