హైదరాబాద్: ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారు. ఈ న్యూయర్ ఇయర్ రోజున ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్తో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇందులో భాగంగా జనవరి 1వ తేదీన ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్కి సిద్ధమవడంతో ఆ దిశగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది. కాగా, దీనిపై కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. క్రిస్టమస్, న్యూయ ఇయర్ వేడుకల కోసం ఈ ప్రేమపక్షులు గత ఆదివారం ఉత్తరాఖండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
In the end, It's all about cherishing the simple things in life 😇❤️#nature
A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on
ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు.
Merry Christmas everyone. 🎄 🎄 I hope all of you have a great day. 👍 😊 pic.twitter.com/Cs1zAT2ZUM
— Virat Kohli (@imVkohli) 25 December 2016
మరోవైపు కోహ్లీ-అనుష్క ఎంగేజ్మెంట్కు ప్రముఖులు హాజరవుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్తో పాటు పలువరు క్రికెటర్లు సైతం ఈ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్కు చేరుకున్నారు.
అనుష్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.