హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీపై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. 19 ఏళ్ల కుర్రాడి స్ధాయి నుంచి కోహ్లీని చూస్తున్నానని, గత కొన్నేళ్లుగా అతడు గొప్ప పరిణామం చెందాడని కొనియాడాడు.
'విరాట్ కోహ్లీ బ్రిలియన్స్. ఒక్క మాటలో వర్ణించలేం. అండర్ 19 వరల్డ్ కప్లో కెప్టెన్గా భారత జట్టును విజేతగా నిలిపిన అనంతరం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా అతను పరిణామం చెందిన తీరు అద్భుతం. క్రికెట్ పట్ల అతడి తపన, స్ఫూర్తి, అంకితభావం అనితర సాధ్యం'' అని కుంబ్లే అన్నాడు.
టెస్టుల్లో 600 వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించాడు. 'రాంచి నుంచి వచ్చినవాడు భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని ఎవ్వరూ అనుకోరు. పదేళ్ల పాటు జట్టును నడిపించిన తీరు, అతను నడుచుకున్న వైనం ఓ అద్భుతం' అని కుంబ్లే అన్నాడు.
'పదేళ్ల పాటు ఒక భారత జట్టుకు ఒకరే కెప్టెన్గా ఉండటం మనం ఎప్పుడూ వినలేదు. ఆటకు అతను సరైన బ్రాండ్ అంబాసిడర్. ఒక బంతికి ఆరు పరుగులు కొట్టాల్సి ఉన్నపుడు.. ప్రత్యర్థి ఒక ఓవర్లో రెండు పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్నపుడు ధోని ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అతను ఏం ఆలోచిస్తాడనే దానిని కూడా మనం అంచనా వేయలేం' అని అన్నాడు.
రెండు వరల్డ్ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం ఇలా కెప్టెన్గా ధోని ఉన్నప్పుడు టీమిండియా సాధించడం నిజంగా ఓ గొప్ప విషయమని కుంబ్లే అన్నాడు. కోచ్గా ఉన్నప్పుడు అత్యంత కఠిమైన జాబ్ ఏంటంటే 'నువ్వు ఆటడం లేదు, జట్టులో నువ్వు లేవు' అని ఓ ఆటగాడికి చెప్పడం అని కుంబ్లే అన్నాడు.