మొహాలీ: టీమిండియాతో ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. తమ చేతిలో ఉన్న మ్యాచ్ను భారత స్టార్ ఆటగాడు కోహ్లీ భారత్ చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. మ్యాచ్ను అతను తమ నుంచి లాగేసుకున్నాడని చెప్పాడు.
అప్పటి వరకు అంతా మా చేతుల్లోనే ఉన్నట్లుగా కనిపించిందని, ఒక్కసారిగా ఏమైందో తెలియకుండా మొత్తం మ్యాచ్ తిరిగిపోయిందన్నాడు. ఏమిటా అని చూస్తే కోహ్లీ వీర విహారం చేశాడన్నాడు. మేం ఏం చేయలేకపోయామని చెప్పాడు.
అవును, క్రికెట్లో సచిన్ తర్వాత కోహ్లీ శకం ఆరంభం: సెహ్వాగ్
ఆసిస్ మ్యాచ్ సందర్భంగా.. చివరలో భారత జట్టు రన్ రేట్ అప్పటి వరకు 7 మాత్రమే. మిగిలిన ఓవర్లు నాలుగు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో 47 పరుగులు చేయాలి. సగటున ఓవర్కు 12 పరుగులు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందని చాలామంది అనుకోలేదు. కానీ కోహ్లీ సాధ్యం చేశాడు. ధోనీ, కోహ్లీ కలిసి కేవలం 5.1 ఓవర్లలో 67 పరుగులు సాధించడంతో ఆసిస్ ఇంటిదారి పట్టింది.
ఈ సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ.. నిజంగా ఈ ఇన్నింగ్స్ గొప్పదని చెప్పాడు. భారత జట్టు ప్రతి బంతికి రెండు పరుగుల చొప్పున చేయాల్సి రావడంతో తాము చాలా పటిష్టంగా ఉన్నామని అనుకున్నామని చెప్పాడు. 160 పరుగులు ఈ వికెట్లో మంచి స్కోర్ అన్నాడు. కానీ ఒత్తిడిలోను కోహ్లీ అద్భుతంగా రాణించాడని కితాబిచ్చాడు.
చేజింగులో కోహ్లీ యావరేజ్ అద్భుతంగా ఉందని, సరిగ్గా కావాల్సిన సమయంలో రాణించినందుకు కోహ్లీకి హ్యాట్సాప్ అన్నాడు. కోహ్లీ చాలామంచి షాట్లు ఆడతాడని, సరిగ్గా చూసుకొని కొట్టడంలో నిపుణుడు అని ప్రశంసించాడు.
వాట్ ఏ మ్యాచ్: ట్విట్టర్లో కోహ్లీకి అనుకొని అతిథి ప్రశంస
సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీని పోల్చుతూ మీడియా స్మిత్ను ప్రశ్నించింది. దానికి స్మిత్ మాట్లాడుతూ.. సచిన్ టెండుల్కర్, కోహ్లీలు డిఫరెంట్ ఆటగాళ్లు అని చెప్పాడు. కోహ్లీ తెలివైన, మంచి ఆటగాడు అన్నాడు. ఈ రోజు అతను ఆడిన మ్యాచ్ ద్వారా అతను ఏమిటో తెలిసిందని చెప్పాడు.
చేజింగులో అతని యావరేజ్ 60కి పైగా ఉందని చెప్పాడు. ఇది చాలా గొప్పదన్నాడు. మ్యాచ్ విన్నర్లకు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ అని తాను భావిస్తానని చెప్పాడు. అతను నమ్మశక్యం కాని విధంగా ఆడాడని చెప్పాడు. ట్వంటీ 20 ఫార్మాట్లో అద్భుతం అన్నాడు. హ్యాట్సాప్ టు కోహ్లీ అన్నాడు.