|
పిచ్ను పరిశీలిస్తున్న స్ఫిన్ త్రయం అశ్విన్, జడేజా, జయంత్
గురువారం మధ్యాహ్నానానికి ఔట్ ఫీల్డ్ ఆరిపోవడంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ప్రాక్టీసులో పాల్గొన్నారు.
|
తలపై ప్రేమగా నిమురుతూ కోహ్లీ
ఇదే సమయంలో స్టేడియంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన శునకాలతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంత సమయం గడిపారు. కాసేపు వాటితో సరదాగా గడిపిన కోహ్లీ ఓ శునకం తలపై ప్రేమగా నిమురుతూ మంచినీరు తాగించాడు. కోహ్లీ శునకాలకు నీరు తాగించే ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.
|
మద్రాసు క్రికెట్ క్లబ్
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మరోవైపు శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియం వద్ద భద్రతను పెంచారు. భద్రతా సిబ్బంది స్టేడియం లోపల, బయట తనిఖీలు నిర్వహించారు.
|
3-0తో టెస్టు సిరిస్ని కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై టెస్టులో కూడా విజయం సాధించి 4-0తో సిరిస్ను చేజిక్కించుకోవాలనే ఆలోచనలో కోహ్లీ సేన ఉంది. మరోవైపు కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే కసిలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు.