హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ముగిసిన తర్వాత టీమిండియా బ్యాట్స్మన్ మనీష్ పాండే పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు జట్టు సభ్యులు. హోటల్లో కేక్ కట్ చేసి బర్త్ డే బాయ్కి శుభాకాంక్షలు చెప్పారు.
ఎప్పటిలాగే పాండేకు ఒంటినిండా కేక్ పూసి ఆటపట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పాండే కేక్ కట్ చేయగానే ధోని అతన్ని వెనక నుంచి పట్టుకోగా మిగతా జట్టు సభ్యులు అతన్ని కేక్తో ముంచెత్తారు.
నిజానికి పాండే పుట్టినరోజు సెప్టెంబర్ 10నే అయినప్పటికీ... టీమ్ అంతా కలిసి గురువారం ప్రత్యేకంగా పాండ్యాతో పుట్టినరోజు కేక్ చేయించారు. కాగా, ఐదు వన్డేల సిరిస్లో ఇప్పటికే కోహ్లీసేన 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది.