పెర్త్: భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డేలో రోహిత్ శర్మ రాణించాడు. అతను 163 బంతుల్లో 171 పరుగులు చేశాడు. రోహిత్ రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగులు చేసింది. భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. తాజాగా రోహిత్ శర్మ రికార్డులు సృష్టించాడు.
- పెర్త్లోని వాగా మైదానంలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ.
- ఆస్ట్రేలియాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారతీయుడిగా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. తాజా వన్డేలో రోహిత్ శర్మ 171 పరుగులు చేశాడు. గతంలో యువరాజ్ సింగ్ పేరిట ఇది ఉంది. 2004లో యువీ ఆస్ట్రేలియాలో 139 పరుగులు చేశాడు.
- పెర్త్లో 171 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రెండో బ్యాట్సుమెన్ రోహిత్ శర్మ. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ (ఆప్ఘనిస్తాన్ పైన 2015 మార్చిలో) 178 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
- ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. 19 ఇన్నింగ్సుల్లో పూర్తి చేశాడు.
- వివిఎస్ లక్ష్మణ్ తర్వాత... వన్డేల్లో ఆస్ట్రేలియాలో మూడో సెంచరీ చేసినవాడు రోహిత్ శర్మ.
- ఇది రోహిత్ శర్మకు నాలుగో 150+. రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, జయసూర్య సాధించారు. సచిన్ టెండుల్కర్ 150 పరుగుల కంటే ఎక్కువ ఐదుసార్లు చేశాడు.
- ఆస్ట్రేలియాలో ఆడిన విదేశీ ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వాడు రోహిత్ శర్మ. గతంలో జింబాబ్వేకు చెందిన స్టార్ట్ కార్లిస్లే 119 పరుగులు చేశాడు.
- ఆస్ట్రేలియా పైన నాలుగు సెంచరీలు చేసిన భారతీయుల్లో రోహిత్ శర్మ, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. వీరికంటే ఎక్కువగా సచిన్ టెండుల్కర్ ఒక్కడే 9 సెంచరీలు చేసాడు.
- రోహిత్ - కోహ్లీలు రెండో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరు ఈ వన్డేలో 207 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గతంలో (లక్ష్మణ్ - టెండుల్కర్లు ఇండోర్లో 2001లో) 199 పరుగులు చేశారు.
- 207.. ఆస్ట్రేలియాలో ఇది మూడో హయ్యెస్ట్ భాగస్వామ్యం.
- రోహిత్ - కోహ్లీ భాగస్వామ్యంలోని 207 పరుగులు భారత్కు రెండో హయ్యెస్ట్ భాగస్వామ్యం. గతంలో 2004 జనవరిలో సిడ్నీలో లక్ష్మణ్ - యువరాజ్ సింగ్ల భాగస్వామ్యం 2013 పరుగులు చేసింది.