ఇంగ్లాండ్ సిరిస్కు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్గా
35 ఏళ్ల ధోని త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్కు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్గా ఎంపికయ్యాడు. జనవరి 15న పూణెలో జరగనున్న తొలి వన్డేలో ధోని యాక్షన్లోకి దిగనున్నాడు. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఇంగ్లాండ్తో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ కెప్టెన్గా ధోనికి ఆఖరి మ్యాచ్.
సోషల్ మీడియాలో వైరల్ అయిన యువీ, ధోనిలు సరదా వీడియో
ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ఎంతో అప్యాయంగా ధోని భుజాలపై చేతులు వేసి మరీ అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు.
కెప్టెన్గా ప్రయాణం చాలా బాగుంది
టీమిండియాలో కెప్టెన్గా ప్రస్ధానం గురించి ధోనిని యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. ‘టీమిండియా కెప్టెన్గా ప్రయాణం చాలా బాగుంది. నీలాంటి ఆటగాళ్లు ఉండడంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకు భారంగా అనిపించలేదు. పదేళ్లు సారథ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాను. ఏదైతే అనుభూతిని పొందుతున్నానో దానిని చక్కగా ఎంజాయ్ చేశా' అని సమాధానం చెప్పాడు.
అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్
ఆ తర్వాత యువీ మాట్లాడుతూ ‘అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్. నీ నాయకత్వంలో ఆడడం చాలా అద్భుతంగా అనిపించింది. మూడు మేజర్ టోర్నమెంట్లు, ప్రపంచకప్ గెలవడంతో పాటు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్గా నిలిపిన ఘనత నీదే' అని ధోనిపై ప్రశంసలు కురిపించాడు.
ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను
మధ్యలో ధోని జోక్యం చేసుకుని ‘నువ్వు ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను' అని అన్నాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ధోనికి యువీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత యువరాజ్ ఏమైనా అడగడం మర్చిపోయానా? అని అన్నాడు. దీనికి ధోని ఇక ఏమీ అడగొద్దన్నాడు. ధోనీపై ఉన్న కెప్టెన్సీ భారం పోవడంతో ఇక తామిద్దరం స్వేచ్ఛగా ఆడతామని యువీ ఈ మ్యాచ్కు ముందే చెప్పాడు.