హైదరాబాద్: పుట్బాల్ మ్యాచ్లో విషాదం చోటు చేసుకుంది. తన సహచర ఆటగాడు బలంగా తాకడంతో ఇండోనేషియాకు చెందిన గోల్ కీపర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే పెర్సెలా-ఎస్పీఎఫ్సీ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఇండోనేషియా జట్టు తరుపున సుమారు 500కుపైగా మ్యాచ్లు ఆడిన 38 ఏళ్ల చోయ్రుల్ హుడా ఈ మ్యాచ్లో పెర్సెలా జట్టుకు గోల్ కీపర్గా ఉన్నాడు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 43వ నిమిషంలో ఎస్పీఎఫ్సీ మిడ్ఫీల్డర్ రోమన్ రోడ్రిక్స్ బంతిని గోల్గా మలిచేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో రోమన్ను అడ్డుకునేందుకు హుడా పరిగెత్తకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు బలంగా ఢీ కొన్నారు. దీంతో వెంటనే హుడా మైదానంలో కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్పై హుడాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరే క్రమంలోనే హుడా తుదిశ్వాస విడిచాడు. రోమన్ అడ్డుకునే సమయంలో అతడి మోకాలు బలంగా ముఖానికి తాకడంతో శ్వాస తీసుకునేందుకు హూడా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో హుడాకు గుండె నొప్పి వచ్చిందని దీంతో అతడిని కాపాడ లేకపోయామని హుడాకు వైద్యం అందించిన వైద్యులు తెలిపారు.
ఇండోనేషియా జాతీయ జట్టుకు ఆడుతున్న హూడా 1999 నుంచి హుడా పెర్సెలా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.