జీ టీవీలో ప్రసారమవుతున్న 'కుమ్కుమ్ భాగ్య'
జీ టీవీలో ప్రసారమయ్యే 'కుమ్కుమ్ భాగ్య' అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్. హీందీలో ఈ సిరియల్ బ్లాక్ బస్టర్ కావడంతో భారత్లోని వివిధ భాషల్లోకి అనువాదమైంది. అనువాదమైన అన్ని భాషల్లోనూ ఈ సీరియల్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. అయితే ఘనాకు కుమ్కుమ్ భాగ్య సీరియల్కు ఉన్న సంబంధం ఏంటని ఆశ్చర్యపోకండి.
2015 నుంచి ఘనాలో కూడా ప్రసారం
ఎందుకంటే ఈ సీరియల్ 2015 నుంచి ఘనాలో కూడా వారి స్ధానిక భాష 'ట్వి'లో ప్రసారమవుతోంది. అక్కడ కూడా ఈ సీరియల్ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎంతలా అంటే ఈ సీరియల్కు సంబంధించి అక్కడి విద్యార్థుల పరీక్ష పత్రాల్లో కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయట.
సీరియల్ నటీనటులను కలవడం మొదటి పనిగా
ప్రీక్వార్టర్స్ కోసం ముంబైకి చేరుకున్నాక, అక్కడ తాము చేయాల్సిన పనుల్లో ఈ సీరియల్ నటీనటులను కలవడం మొదటి పనిగా పెట్టుకున్నారట. 'సీరియల్ నటీనటులైన లేదా నిర్మాతలైనా సరే.. ఇలా ఎవరు దొరికినా వాళ్లతో ఫొటోలు దిగాలనుకుంటున్నాం. కనీసం ఐదు నిమిషాలు సమయం దొరికినా చాలు' అని ఘనా ఫుట్బాల్ బోర్డు ఛైర్మన్ క్వాడ్వో అగ్యేమాంగ్ తెలిపాడు.
ఏకాగ్రత తగ్గకుండా ఉండేందుకు వారి ఫోన్లను లాక్కున్నా
ఘనా అండర్-17 ఫుట్బాల్ ప్లేయర్లందరూ ఈ సీరియల్కు అభిమానులు కావడం విశేషం. దీంతో ఇప్పటికే మిస్సయిన ఎపిసోడ్లను ఫోన్లలో చూసేందుకు ప్రయత్నిస్తున్నారని, సీరియల్ గొడవలో పడి ఆట మీద ఏకాగ్రత తగ్గకుండా ఉండేందుకు వారి ఫోన్లను లాక్కున్నానని, తాను కూడా ఈ సీరియల్కి పెద్ద అభిమానినని అగ్యేమాంగ్ చెప్పాడు.