కేరళ బ్లాక్ బస్టర్స్తో మ్యాచ్
‘కేరళ బ్లాక్ బస్టర్స్తో జరిగే మ్యాచ్ చాలా కష్టమైంది. మా లక్ష్యం గెలుపే. ఎల్లవేళలా అట్లెటికో డి కోల్ కతా విజయ లక్ష్యంతోనే ముందుకెళుతుంది. ఇది మా లక్ష్యం. అన్నివేళలా ఒక మంచి జట్టుతో ఆడగలగడం అంత తేలిక్కాదు. కానీ మేం మెరుగ్గా ఆడగలం' అని తెలిపాడు. అట్లెటికో డి కోల్ కతా కోచ్ జోస్ మొలీనా ప్రతి మ్యాచ్లోనూ అటాకింగ్ ప్లేయర్లను రొటేట్ చేస్తూ ముందుకుసాగుతున్నాడు.
పొస్టిగకు తోడు ఒకసారి ఇయాన్ హుం, మరోసారి జువాన్ బెలెంసోకోలతో అటాకింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నాడు.
టీం ముఖ్యం, ప్లేయర్లు కాదు
దీనిపై పొస్టిగ స్పందిస్తూ ‘మీరు ఇద్దరు అద్భుతమైన ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నారు. నేనెలా ఆడాలో కోచ్ నిర్దారిస్తాడు. నా వరకు టీం చాలా ముఖ్యం. ప్లేయర్లు ముఖ్యం కాదు. మీరు చాలా తెలివైన, ఇంటిలిజెంట్ ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నారు. వారితో కలిసి ఆడటం ఇబ్బందికరమేమీ కాదు' అని పొస్టిగ మీడియాతో అన్నాడు.
బంతిపై ఆధిక్యం సాధించాలి
కేరళ జట్టును పరిగణనలోకి తీసుకుంటే కొప్పెల్ టీం లాంగ్ బాల్స్ ఆడగల సామర్థ్యం కలిగి ఉంది. లాంగ్ బాల్స్ అటాకింగ్ చేయడంలో ముందు ఉంటుందని కోల్కతా కోచ్ జోస్ మొలీనా వ్యాఖ్యానించాడు. బంతిపై ఆధిక్యం సాధించడానికి ప్రాధాన్యం ఇస్తుందన్నాడు. తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైనా.. తర్వాతర్వాత పుంజుకుని టాప్ 4 బాక్స్ లో చేరిపోయిందన్నాడు. కనుక కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగే మ్యాచ్ చాలా టప్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. కానీ తాము కూడా మెరుగయ్యామని, టాప్ 4లో చోటు దక్కించుకోవడమే తమ లక్ష్యమని మొలీనా తెలిపాడు.
మిడ్ ఫీల్డర్ సమీగ్ దౌటీ
అట్లెటికో డి కోల్ కతా జట్టులో నిరంతరం ప్రతిభావంతమైన మిడ్ ఫీల్డర్ సమీగ్ దౌటీ మ్యాచ్లో అందుబాటులో ఉంటాడా? లేదా? తెలియదు. హెన్రిక్యూ సెరెనో, బైద్యనందా సింగ్ ల బాగస్వామ్యంపై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నాడు. ‘కొందరు ప్లేయర్లు ఆడటం సందేహస్పదమే. దౌటీ వారిలో ఒకడు. బైద్యనందాసింగ్, హెన్రిక్యూ సెరెనో కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు' అని మొలీనా చెప్పాడు.