హైదరాబాద్: జపాన్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్స్లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో హాంకాంగ్కు చెందిన హు యున్పై కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు.
హు యున్పై శ్రీకాంత్ అలవోక విజయం సాధించడం విశేషం. 21-12తో తొలి గేమ్ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ 21-11తో రెండో గేమ్ను కూడా సొంతం చేసుకుని క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు అంతకుముందు జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్లో చైనా క్రీడాకారుడు సు జెన్ హావోపై ప్రణయ్ విజయం సాధించాడు.
అయితే వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో జెన్హోపై 21-16, 23-21 తేడాతో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు.