రాయపూర్: ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి జేపీ డుమిని యంగ్ బ్యాట్సుమెన్ శ్రెయాస్ అయ్యర్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. అతను బాగా ఆడుతున్నాడని, మరో రెండేళ్లలో అతను భారత్కు ఆడుతాడని చెప్పాడు.
మంగళవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా జేపీ డుమిని స్పందించాడు. అయ్యర్ అర్ధ సెంచరీ, జహీర్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తాము గెలిచేందుకు ఉపయోగపడిందన్నాడు.
ఇరవై ఏళ్ల శ్రెయాస్ అయ్యర్ ముంబైకి చెందిన వాడు. ఐపీఎల్లో అతను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ఇది అతని ఆరంభ ఐఫీఎల్. శ్రెయాస్ అయ్యర్ 13 ఇన్నింగ్స్ ఆడి 419 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇతనిని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది.
మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ 49 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అందులో పది ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఇతనికి మంచి టాలెంట్ ఉందని జేపీ డుమిని చెప్పాడు. నువ్వు మరో రెండు మూడేళ్లలో భారత్కు ఆడుతావని తాను స్వయంగా అతనికి చెప్పానని తెలిపాడు.