హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. జోన్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతున్న బెంగళూరు బుల్స్ను 29-24 తేడాతో ఓడించింది.
మ్యాచ్ ప్రారంభమైన మొదటి పది నిమిషాలు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఒక దశలో 6-6తో రెండు జట్లు సమంగా నిలిచాయి. అయితే తొలి అర్ధభాగం ముగిసే సరికి 12-8తో తమిళ్ తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో కూడా మరింత పట్టుదలగా ఆడింది.
రెండో అర్ధభాగంలో కూడా 18-10తో ఆధిక్యం నిలిచింది. ఆ ఆధిక్యాన్ని అలానే కొనసాగింది. చివర్లో బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగాడు. దీంతో 24-26తో పుంజుకునే ప్రయత్నం చేసినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. రైడ్ల ద్వారా తమిళ్ తలైవాస్ 16 పాయింట్లు సాధించగా.. బెంగళూరు 15 పాయింట్లు గెలిచింది.
అయితే ఢిఫెన్స్లో పూర్తిగా విఫలమైంది. బెంగళూరు డిఫెండర్లు కేవలం 5 పాయింట్ల మాత్రమే గెలిచారు. తలైవాస్ 10 ట్యాకిల్, 2 ఆలౌట్, 1 అదనపు పాయింట్లు సాధించగా... బెంగళూరు 6 ట్యాకిల్, 2 ఆలౌట్, 1 అదనపు పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ (12) టాప్ స్కోరర్గా నిలిచాడు.