హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న తన బయోపిక్లో నటించేందుకు సిద్ధమని రియో ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత, నటుడు సోనుసూద్ కూడా ధ్రువీకరించాడు.
ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సోనూ సూద్ ఈ విషయం వెల్లడించాడు. ప్రధాన పాత్రను దీపికా పదుకోన్ పోషించనున్నట్టు వస్తున్న వార్తలను ప్రస్తావించగా నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదని అతడు స్పష్టం చేశాడు.
దీపిక పదుకొణె కూడా చిత్రంలో భాగస్వామురాలవుతుందని అతడు పేర్కొన్నాడు. ప్రస్తుతం స్ర్కిప్టు తుది దశలో ఉందని చెప్పిన అతడు ఈ చిత్రంలో తాను ఓ రోల్ పోషించనున్నట్టు సోనుసూద్ తెలిపాడు.