హైదరాబాద్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీకి ఎంపియ్యారు. ఫిబ్రవరి 14-19 వరకు వియత్నాంలో ఈ టోర్నీలో వీరిద్దరూ ఆడనున్నారు.
ఈ సీజన్ ఆరంభంలో మలేసియా మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ మరిన్ని విజయాలను సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచిన పీవీ సింధు మంచి జోరు మీదున్న సంగతి తెలిసిందే.
మహిళల సింగిల్స్లో వీరిద్దరూ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఇక పురుషుల సింగిల్స్కు సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రి విజేత, మంచి ఫామ్లో ఉన్న సమీర్ వర్మ, స్విస్ ఓపెన్ ఛాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ ఎంపికయ్యారు. ఈ టోర్నీకి కిదాంబి శ్రీకాంత్ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు.
ఇక పురుషుల డబుల్స్లో సుమిత రెడ్డి-మను అత్రి, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీలు పోటీ పడనున్నాయి. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం, మిక్స్డ్లో ప్రణవ్-సిక్కి రెడ్డి జోడీ బరిలోకి దిగనుంది. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ, సిక్కిరెడ్డి, మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీలు ఆడతాయి.
ప్రారంభ టోర్నీలో చైనా, కొరియా, జపాన్, మలేసియాకు చెందిన అత్యుత్తమ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీ టైటిల్ కోసం మొత్తం 13 జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-డిలో కొరియా, సింగపూర్ క్రీడాకారులతో భారత్ స్టార్ షట్లర్లు పోటీపడనున్నారు.