హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు చాంపియన్గా అవతరించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-13, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కపై విజయం సాధించి టైటిల్ను సాధించింది.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో పీవీ సింధు 21-13, 21-14 స్కోరుతో వరుస సెట్లలో విజయం సాధించి తొలిసారి ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఏ దశలోనూ సింధును నిలువరించ లేకపోయిన గ్రెగోరియా రన్నరప్గా నిలిచింది. ఇది సింధుకు తొలి సయ్యద్ మోడీ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ కావడం విశేషం.
ఇక పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సమీర్ వర్మ 21-19,21-16 తేడాతో భారత్కు చెందిన సాయి ప్రణీత్ పై విజయం సాధించి టైటిల్ను సాధించాడు.