రియో: ఒలింపిక్ చిహ్నంలో ఐదు రింగులు ఉంటాయి. ఒక్కో రింగ్ ఒక్కో రంగులో ఉంటుంది. ఒలింపిక్ రింగ్స్ చిహ్నం తొలిసారి 1913లో కనిపించింది. ఆధునిక ఒలింపిక్ గేమ్స్కి పితామహుడైన పీయర్ డి కెబర్టిన్.. లేటిన్ ఫ్రేజ్ నించి తీసుకున్నారు.
ఒలింపిక్ ఓత్ని కూడా ఆయనే రాశారు. ఒలింపిక్స్లో గెలవడం కాదు ముఖ్యం, అందులో పాల్గొనడం అనే నినాదాన్ని కూడా ఆయనే ప్రవేశ పెట్టాడు.
1913ఒలింపిక్ రివ్యూ సందర్భంగా కెబర్టిన్ మాట్లాడుతూ.. ఐదు రింగులు నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయని, వాటికి వెనుక వైపున (బ్యాక్ గ్రౌండ్) తెల్ల రంగు ఉంటుందని చెప్పాడు.
ఒలింపిక్ చిహ్నమైన ఐదు రింగ్స్ పూర్తిగా ఆధునిక ఆవిష్కరణ. 1914లో ప్రపంచ దేశాలని కలపాలనే ఉద్దేశంతో ఒలింపిక్ గేమ్స్ని తొలిసారిగా ప్రపంచవ్యాప్తం చేసినప్పుడు ఐదు ఖండాలకి సింబల్గా ఐదు రింగ్స్ని రూపొందించారు. అయితే వీటికి వాడిన రంగుల్లో ఏ రంగు ఏ ఖండానికి చెందినది అన్న దానిమీద వివరణ లేదు.
ఉదాహరణకు స్వీడన్కు నీలం, పసుపు, గ్రీసుకు తెలుపు, నీలం, ఫ్రాన్సు, యూనైటెడ్ కింగ్డమ్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, హంగేరీలకు మూడు రంగులు, స్పెయిన్కు పసుపు, ఎరుపు.. ఇలా అన్ని దేశాల రంగులు ఉన్నాయి.
ఒలింపిక్ క్రీడల జన్మస్థానం గ్రీస్లోని ఏథెన్స్ నగరం. వేల ఏళ్ల క్రితమే గ్రీస్లోని వివిధ రాజ్యాల క్రీడాకారుల మధ్య ఒలింపిక్ పోటీలు జరిగేవి. ప్రస్తుతం ఇవి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతూ వివిధ దేశాలని దగ్గర చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు క్రీడలని స్పాన్సర్ చేస్తున్నాయి.
అయితే గ్రీస్లో వీటి ఆవిర్భావానికి కారణం మతం తప్ప, ఇలా వ్యాపారం కాదు. ఇవి కేవలం గ్రీస్ రాజ్యానికే పరిమితమై మతోత్సవంగా జరపబడేవి. ఆటల్లో మోసం చేసే క్రీడాకారులని తీవ్రంగా శిక్షించేవారు. విజేతలు ఒక్కరే ఉండేవారు తప్ప ఇప్పటిలా రెండు, మూడు స్థానాలు ఉండేవి కాదు.
రెండవ స్థానం, మూడవ స్థానం అంటే.. ఓడిపోయినవాడు అని ఇంకో విధంగా చెప్పడమే అని వారు నమ్మేవారు. ఈ క్రీడల నిర్వహణ సమయంలో రాజ్యాల మధ్య యుద్ధాలు ఉన్నా, క్రీడలు ముగిసేంతవరకూ వాటిని విరమించేవారు.
ప్రాచీన గ్రీక్స్ ఆటలని నగ్నంగానే ఆడేవారు. ఇందుకు వందల కారణాలని ఆధునికులు ఆపాదించారు. గ్రీక్స్ నగ్నత్వాన్ని ప్రేమించేవారు. ప్రేక్షకులు వారి అందాన్ని కూడా ఆరాధించడానికి ఇలా చేసేవారు. ఆలివ్ ఆయిల్ని రాసుకుని నిగనిగలాడే చర్మంతో ఆటకి దిగేవారని అంటారు.
ఒలింపిక్ టార్చ్ కూడా ఆనాటి సంప్రదాయమే. ప్రొయెథియస్ నించి జియస్ జ్ఞానాన్ని దొంగిలించిన గుర్తుగా జ్ఞానానికి ప్రతీక అయిన జ్యోతిని ఈ క్రీడల్లో అగ్నిని ప్రజ్వలింపజేసి, క్రీడలు ముగిసేదాకా దాన్ని రాజేస్తూండేవారు. అదే నేటి ఒలింపిక్ జ్యోతిగా రూపాంతరం చెందింది.
1936లో బెర్లిన్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారిగా ఒలింపిక్ జ్యోతిని ఒకరి నించి మరొకరు తీసుకెళ్లే సంప్రదాయాన్ని పరిచయం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇది నచ్చి దాన్ని కొనసాగిస్తోంది. కొందరు దీన్ని హిట్లర్ ప్రవేశపెట్టినందున, దీనిని తొలగించాలనే వాదనలు ఉన్నాయి.