కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వసీం అక్రమ్ క్షేమంగా బయటపడ్డారు.
కరాచీ జాతీయ స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. జాతీయ స్టేడియం కర్సజ్ రోడ్ సమీపంలో కారులో వెళుతున్న వసీం అక్రమ్పై ఇద్దరు సాయుధులైన దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో కారు దెబ్బతింది.
అయితే వసీం అక్రమ్ దాడి నుంచి క్షేమంగా తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.