శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..!
హైదరాబాదు: శ్రీ చైతన్య విద్యా సంస్థలు.. పరిచయం అక్కర్లేని సంస్థ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్య సంస్థలైన శ్రీచైతన్య విద్యా సంస్థలు తమ బ్రాండ్ను మరింత బలోపేతం చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్గా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ను నియమించింది. దక్షిణ భారత దేశంలో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందిరికీ తెలిసిందే. అందుకే తమ బ్రాండ్ను దక్షిణభారత దేశంలో మరింత బలోపేతం చేసేందుకు టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్తో జతకట్టింది. అల్లు అర్జున్తో త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తుందని గ్రూప్ పేర్కొంది. కొత్తగా 360 డిగ్రీ క్యాంపెయిన్ను అల్లు అర్జున్తో పాటుగా జేఈఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకర్లతో ఈ దసరా సీజన్లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇక దసరా రోజునే జేఈఈ అడ్వాన్స్ 2021 ఫలితాల్లో టాప్ ర్యాంకులను సొంతం చేసుకుంది శ్రీ చైతన్య . డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో మ్రిదుల్ అగర్వాల్ తొలి ర్యాంకును సొంతం చేసుకోగా... క్లాస్ రూం ప్రోగ్రామ్లో 8వ ర్యాంకును చైతన్య అగర్వాల్ సాధించాడు. ఇక 10వ ర్యాంకు మొదుల్ల హృషికేష్ రెడ్డి, 11వ ర్యాంకు దివాకర్ సాయిలు సొంతం చేసుకోగా... మొత్తం 100 ర్యాంకుల్లోపు 26 ర్యాంకులను శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
"శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడుకున్నవి. ఇక్కడ బోధన పద్ధతులు వినూత్నంగా ఉంటాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ పై కూడా దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో విద్యార్థులు ఒక మంచి స్థానానికి చేరి ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే తీర్చి దిద్దడం జరుగుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లుగా వెలుగొందుతున్న వారిలో చాలామంది శ్రీ చైతన్య విద్యాసంస్థల నుంచి వచ్చిన వారే ఉన్నారు. బ్రాండ్ను మరింత బలోపేతం చేసేందుకు అల్లు అర్జున్కు మించిన స్టార్ మరొకరుండరు. అందుకే అల్లుఅర్జున్తో మా సంస్థలు జతకట్టాయి" అని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడెమిక్ డైరెక్టర్ సుష్మ బోపన్న చెప్పారు.
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి ఏటా టాప్ ర్యాంకులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి మేటి విద్యాసంస్థతో జతకట్టడం చాలా సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. క్రమశిక్షణకు సక్సెస్కు మారుపేరు శ్రీ చైతన్య విద్యా సంస్థలని ప్రశంసించారు స్టయిలిష్ స్టార్. ఈ విద్యా సంస్థలతో భాగస్వామి అవడం చాలా సంతోషంగా ఉందని తాను ప్రచారకర్తగా మంచి ఫలితాన్ని అందిస్తానని చెప్పారు అల్లు అర్జున్.
శ్రీ చైతన్య విద్యాసంస్థలు నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను టాప్ ర్యాంకర్లుగా తీర్చి దిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. అల్లు అర్జున్ను ప్రచారకర్తగా నియమించడంతో దక్షిణ భారత దేశంలోని విద్యార్థులు మరింత కనెక్ట్ అవుతారు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. నేటి పోటీ ప్రపంచంలో తమ విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసేందుకు తయారు చేసిన ప్రణాళికలో భాగంగానే అల్లు అర్జున్తో తమ సంస్థలు జతకట్టాయని ప్రకటనలో వెల్లడించింది.
ఇక శ్రీ చైతన్య విద్యాసంస్థలు 1986లో ప్రారంభించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లలో విద్యాసంస్థలు విస్తరించి ఉన్నాయి. వీటిలో దాదాపుగా 7 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఏటా ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే జేఈఈ, నీట్లలో ఆలిండియా టాప్ ర్యాంకులు శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులకు వస్తున్నాయి. గత 36 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తోన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు నేడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్యా సంస్థలుగా అవతరించాయి.
పూర్తి
వివరాలకోసం
సంప్రదించండి:
Priyadarshini
S
K,
Head
of
Communication
Mobile:
+91
91000
27043
Email:
[email protected]