ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజాం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా రాజాం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. పునర్విభజన అనంతరం రేగిడి ఆముదాలవలస మండలం పూర్తిగా రాజం లో కలిసింది. గతంలో ఉన్న ఉణుకూరు నియోజకవర్గం 2009 లో రద్దు అయిం ది. ఉణుకూరు నుండి ప్రస్తుత టిడిపి ఏపి అధ్యక్షుడు..మంత్రి కళా వెంకటరావు నాలుగు సార్లు గెలుపొందారు. ఆయన సోదరుడు గణపతిరావు ఒక సారి గెలిచారు. ఇక్కడ మరో రాజకీయ కుటుంబం పాలవలస కుటుంబం ముగ్గురు ఎమ్మెల్యే లు అయ్యారు. జిల్లాలో కీలక నియోజకవర్గం ఉన్న ఉణుకూరులో 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడు సార్లు, టిడి పి అయిదు సార్లు, కెఎల్పి, జనతా, స్వతంత్ర అభ్యర్ధులు ఒక్కోసారి గెలిచారు. ఇక, రాజాం నియోజకవర్గం లో టిడిపి సీని చర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రెండు సార్లు ఓడిపోయారు. 2014 ఎన్నిక నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తి గా మారిపోయాయి.
2009
లో
కాంగ్రెస్..2014
లో
వైసిపి
గెలుపు..
రాజాం
నియోజకవర్గం
ఏర్పడిన
తరువాత
2009
లో
జరిగిన
తొలి
ఎన్నికల్లో
కాంగ్రెస్
నుండి
ఎచ్చెర్ల
నియోజకవర్గంలో
ఓడించిన
కోండ్రు
మురళీ
పోటీ
చేయగా..టిడిపి
నుండి
ప్రతిభా
భారతి
పోటీ
చేసారు.
ఆ
ఎన్నికల్లో
కోండ్రు
మురళీకి
61,771
ఓట్లు
రాగా,
టిడిపి
అభ్యర్ధి
ప్రతిభా
భారతికి
34,638
ఓట్లు
వచ్చాయి.
ఇక,
2014
ఎన్నికల
నాటికి
టిడిపి
-
వైసిపి
మధ్య
ప్రధాన
పోటీ
జరిగింది.
2014
ఎన్నికల్లో
రాజాం
నియోజకవర్గంలో
మొత్తం
199230
ఓట్లు
ఉండగా,
అందులో
1417198
ఓట్లు
పోల
య్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కంభాల
జోగులు
కు
69192
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
ప్రతిభా
భారతికి
68680
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ధి
జోగులు
512
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
రెండు
సార్లు
ఎమ్మెల్యేగా
మంత్రిగా
పని
చేసిన
కోండ్రు
మురళీ
ఇక్కడి
నుండి
కాంగ్రెస్
అభ్యర్ధిగా
పోటీ
చేసి
4790
ఓట్లు
మాత్రమే
సాధించి
డిపాజిట్
కోల్పోయారు.