బావిలో పడిన దొంగ..! నడుం విరిగి, 3 రోజులు బావిలోనే నరకం...
శ్రీకాకుళంలో ఓ వింత సంఘటన చోటుసుకుంది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో నడుం విరిగింది. దీంతో మూడు రోజుల పాటు ఎలాంటీ సహయం లేక బావిలో ఉన్నాడు. మూడు రోజుల అనంతరం అటుగా వెళ్లిన వారికి బావినుండి మనుషుల శబ్దం రావడంతో గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో బయటికి తీశారు. అప్పటికే తీవ్ర గ్రాయాల పాలైన దొంగను కుటుంభసభ్యులకు అప్పగించారు.
దొంగతనాలు చేయడమంటే సహసం చేయడమే... ఎక్కడ పట్టుబడకుండా చోరీ చేయడం కూడ ఓ కళగానే భావిస్తారు. పట్టుపడితే మాత్రం ఉన్న ప్రాణాలు గాళ్లో కలిసినట్టే... ఈనేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాం మండలంలోని కొప్పలపేట గ్రామంలో గత మంగళవారం రాత్రీ ఇద్దరు దొంగలు గ్రామంలోకి వచ్చారు. దీంతో వారిని గుర్తించిన గ్రామస్థులు దోంగలను గమనించారు. ఈ నేపథ్యంలోనే దోంగలు పారిపోయో ప్రయత్నం చేశారు. అయితే పారిపోతున్న క్రమంలోనే ఒకరిని గ్రామస్థులు పట్టుకోని పోలీసులకు అప్పగించారు.
అయితే పారిపోయో క్రమంలో రెండో దోంగ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. దీంతో నడుము విరిగి కదలలేని స్థితికి చేరాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు గమనించలేదు.దీంతో దోంగ మూడు రోజుల పాటు బావిలోనే పడి ఉన్నాడు. చివరకు అటునుండి వెళుతున్న ప్రజలకు బావిలోపలి నుండి మనుషులు చేస్తున్న శబ్దాలు వస్తుండడంతో గమనించిన గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దోంగను బయటకు తీశారు. కాగా దోంగకు సంబంధించిన అడ్రస్ను కనుక్కున్న పోలీసులు కుటుంభసభ్యులు పిలిపించి అప్పగించారు. అప్పటికే గాయాలతో ఇబ్బందిపడుతున్న దోంగపై ఎలాంటీ కేసు లేకుండానే వదిలిపెట్టారు.