వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోరం: ఆ చిన్నారిని బతికుండగానే చంపేశారు, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: పాము కరిచిందని వెళ్తే, బతికుండగానే శవపరీక్ష చేసి పంపించిన దారుణ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఈ నెల 19వ తేదీన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పరిధి హవాల్దార్‌పల్లికి చెందిన 13 ఏళ్ల రిషిత ఇంట్లో నిద్రిస్తుండగా పాము కరిచింది.

షాకింగ్: ఆ ఆసుపత్రిలోని 16మంది నర్సులకు ఒకేసారి ప్రెగ్నెన్సీషాకింగ్: ఆ ఆసుపత్రిలోని 16మంది నర్సులకు ఒకేసారి ప్రెగ్నెన్సీ

అర్ధరాత్రి పూట ఈ పాము కరిచింది. కుటుంబ సభ్యులు మొదట ముల్కనూర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

13 year old girl declared dead, Slams doctors for negligence

అక్కడి వైద్యులు బాలిక చనిపోయినట్లు మంగళవారం చెప్పారు. శవపరీక్ష కోసం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం వైద్యులు మాత్రం ఆమె బతికే ఉందని గుర్తించి, అత్యవసర చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఆమె మంగళవారం సాయంత్రం కన్నుమూసింది.

బతికుండగానే చనిపోయినట్లు ధ్రవీకరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
13 year old girl declared dead in Warangal district. Slams doctors for negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X