తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా వైరస్ కేసులు.. తొమ్మిది మంది మృతి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికి పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,554 మందికి కరోనా వైరస్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం సంఖ్య 49,259కి చేరింది. వైరస్ సోకి 9 మంది బుధవారం చనిపోగా.. ఇప్పటివరకు చనిపోయిన మొత్తం సంఖ్య 438కి చేరింది. 37,666 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇవాళ 1,281 మందిని ఇంటికి పంపించి వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,155 యాక్టివ్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇక కరోనా వైరస్ కేసుల వివరాలను నగరాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 842 మందికి వైరస్ వచ్చింది. రంగారెడ్డి 132, మేడ్చల్ 96 ఎక్కువగా కేసులు వచ్చాయి.
Recommended Video
సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిర్మల్ 1, కరీంనగర్ 73, జగిత్యాల 3, యాదాద్రి భువనగిరి 8, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 23, మెదక్ 25, మహబూబ్ నగర్ 14, మంచిర్యాల 3, భద్రాద్రి కొత్తగూడెం 1, నల్లగొండ 51, రాజన్న సిరిసిల్ల 18, ఆదిలాబాద్ 8, ఆసీఫాబాద్- 2, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 14, నిజామాబాద్ 28, ములుగు 8, వనపర్తి 21, సిద్దిపేట 2, సూర్యాపేట 22, గద్వాలలో 5 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం 1554 మందికి వైరస్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నది.