వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 1,567 కరోనా కేసులు.., 50 వేల మార్క్‌కు చేరిన వైరస్, 9 మంది మృతి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 13 వేల 367 మంది పరీక్షలు నిర్వహించగా 1567 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 50 వేల 826 చేరింది. 1661 మంది వైరస్ తగ్గడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన మొత్తం సంఖ్య 37 వేల 666కి చేరింది. కరోనాతో గురువారం 9 మంది చనిపోయారు. చనిపోయిన మొత్తం సంఖ్య 447 మందికి చేరింది. ప్రస్తుతం 11,052 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటివరకు 3,22,326 మందికి టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 842 పాజిటివ్ కేసులు రాగా ఇవాళ 662 వచ్చాయి. రంగారెడ్డి 213, వరంగల్ అర్బన్ 72, సిరిసిల్లలో 61, మేడ్చల్ 22, సంగారెడ్డిలో 32 పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో లోకల్ ట్రాన్స్ మిషన్ ఉంది అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. తర్వాతి దశ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్.. కావడంతో ఆందోళన నెలకొంది.

1567 coronavirus positive cases register in telangana..
English summary
1567 coronavirus positive cases register in telangana and 9 people are dead health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X