లెక్చరర్ పాడు బుద్ధి: పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి రేప్
హైదరాబాద్: ఓ లెక్చరర్ తన పాడు బుద్ధిని ప్రదర్శించుకున్నాడు. 17 ఏళ్ల అమ్మాయిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. తన మాట వినికపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి అతను ఈ అకృత్యానికి పాల్పడ్డాడు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి హయత్నగర్లో నివాసం ఉంటోంద. ఈ కేసులో అనుమానితుడు తిరుపతి వరంగల్కు చెందినవాడు. ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు
గత నాలుగు నెలలుగా తిరుపతి తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక బుధవారంనాడు తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు విషయం కనుక్కోవడానికి కాలేజీకి వెళ్లాడు.
ఆ విషయం తెలిసి తిరుపతి పారిపోయాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి, అమ్మాయిపై అతను అత్యాచారం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.తిరుపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు.