వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 ప్రైవేట్ ల్యాబ్ప్‌కు పర్మిషన్, 27కి చేరిన ల్యాబ్‌ల సంఖ్య, చార్జీ మాత్రం రూ.2200

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 18 ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 9 ప్రభుత్వ ల్యాబుల్లో మాత్రమే అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష కోసం రూ.2200 మాత్రమే వసూల్ చేయాలని, అంతకుమించి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు కరోనా టెస్టుల వివరాలు, పాజిటివ్ సంఖ్య ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టంచేశారు.

 9 ప్రభుత్వ ల్యాబ్‌లు

9 ప్రభుత్వ ల్యాబ్‌లు

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు సికింద్రాబాద్‌లోని గాంధీ మెడిక‌ల్ కాలేజీ, హైద‌రాబాద్‌లోని నిమ్స్, సీసీఎంబీ, ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ, స‌ర్ రొనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపిక‌ల్ & క‌మ్యూనిక‌ముబుల్ డిసీజెస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్, ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజీ, సెంట‌ర్ ఫ‌ర్ డీఎన్ఏ ఫింగ‌ర్‌ప్రింటింగ్ & డ‌యాగ్నోస్టిక్స్, వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీల్లో క‌రోనా ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్స్ ఉన్నాయి.

సిద్దిపేటకు రానీ పర్మిషన్

సిద్దిపేటకు రానీ పర్మిషన్

రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్స్‌కు భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్), నేష‌న‌ల్ అక్రిడిటేష‌న్ బోర్డ్ ఫ‌ర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేష‌న్ ల్యాబొరేట‌రీస్ (ఎన్ఏబీఎల్) ఆమోదం లభించింది. సిద్దిపేట‌లో మ‌రో ల్యాబ్ (ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్) అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఇంకా ఎన్ఏబీఎల్ ప‌ర్మిష‌న్ పెండింగ్‌లో ఉంది.

 ఆ 18 ల్యాబులివే..

ఆ 18 ల్యాబులివే..

ఆ 18 ప్రైవేట్ ల్యాబ్స్ లిస్ట్ చుద్దాం పదండి. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో, హిమ‌య‌త్ న‌గ‌ర్‌లోని విజ‌య డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్, ఐడీఏ చ‌ర్ల‌ప‌ల్లిలోని వింతా ల్యాబ్, సికింద్రాబాద్ బోయిన్‌ప‌ల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, పంజాగుట్టలోని డాక్ట‌ర్ రెమిడీస్ ల్యాబ్, మేడ్చ‌ల్‌లోని ప్యాథ్‌కేర ల్యాబ్, శేరిలింగంప‌ల్లిలోని అమెరిక‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాథాల‌జీ అండ్ ల్యాబ్ సైన్సెస్, సికింద్రాబాద్ న్యూ బోయిన్‌ప‌ల్లిలోని మెడిక్స్ ప్యాథ్‌ల్యాబ్స్, సికింద్రాబాద్‌లోని య‌శోదా హాస్పిట‌ల్, మేడ్చ‌ల్‌లోని బ‌యోగ్నోసిస్ టెక్నాల‌జీస్ ల్యాబ్, బంజారాహిల్స్‌లోని టెనెట్ డ‌యాగ్నోస్టిక్స్, గ‌చ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్, బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిట‌ల్, సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్, మాదాపూర్‌లోని మ్యాప్ మై జినోమ్ ల్యాబ్, చ‌ర్ల‌ప‌ల్లిలోని లెప్రా సొసైటీ, బ్లూ పీట‌ర్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్, సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడిక‌ల్ డ‌యాగ్నోస్టిక్స్, బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిట‌ల్

English summary
18 private labs will conduct coronavirus test in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X