దారుణం : ఐదు నెలలుగా చెల్లెలిపై అన్న అత్యాచారం
నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం వెలుగుచూసింది. 19 ఏళ్ల ఓ యువతిపై స్నేహితుడితో కలిసి ఆమె పెద్దనాన్న కొడుకు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ పట్టణంలో నివసించే ఆ యువతి తల్లిదండ్రులు దినసరి కూలీలు. దీంతో రోజూ ఉదయాన్నే కూలీ పనుల కోసం భార్యాభర్తలు ఇంటి నుంచి వెళ్లేవారు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉండేది.
యువతి ఇంటికి సమీపంలోనే ఉండే ఆమె పెద్దనాన్న కొడుకు నవీన్(25) ఇదే అదనుగా భావించాడు. తన స్నేహితుడు రవి(22)తో కలిసి తరుచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. అలా ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. గత ఐదు నెలల నుంచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
యువతిని ఆరా తీయగా తాను గర్భం దాల్చినట్టు చెప్పింది. నవీన్,రవి ఐదు నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని వాపోయింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దిశా హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ ఘటన తర్వాత కూడా మహిళలపై ఇలాంటి ఆకృత్యాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోన్న అంశం.