తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు, 4వేలకు చేరువలో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 46,808 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 191 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 191 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,69,556కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3942గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 2784 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత
24
గంటల్లో
తెలంగాణ
రాష్ట్రంలో
162
మంది
కరోనా
నుంచి
కోలుకున్నారు.
దీంతో
ఇప్పటి
వరకు
కరోనా
మహహ్మారి
నుంచి
సురక్షితంగా
బయటపడినవారి
సంఖ్య
6,61,646కి
చేరింది.
ప్రస్తుతం
రాష్ట్రంలో
3968
యాక్టివ్
కేసులున్నాయి.
రాష్ట్రంలో
రికవరీ
రేటు
98.81
శాతంగా
ఉంది.
గత
24
గంటల్లో
నమోదైన
కరోనా
కేసుల
కంటే
రికవరీలు
తక్కువగా
ఉండటంతో
యాక్టివ్
కేసుల్లో
స్వల్ప
పెరుగుదల
నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 07, జీహెచ్ఎంసీలో 49. జగిత్యాలలో 02, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 02, కరీంనగర్లో 19, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్నగర్లో 06, మహబూబాబాద్లో 02, మంచిర్యాలలో 10, మెదక్లో 01, మేడ్చల్ మల్కాజ్గిరిలో 10, ములుగులో 00, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 08, నారాయణపేటలో 00, నిర్మల్లో 01, నిజామాబాద్లో 02, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 06, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 04, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్లో 03, వరంగల్ అర్బన్లో 12, యాదాద్రి భువనగిరిలో 05 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ములుగు,నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video
మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 13,23,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,623 మంది కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లకు పెరిగింది. మంగళవారం 197 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,52,651కి పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 19,446 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి బయటపడినవారి సంఖ్య 3.34 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,78,098 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.52 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.15 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మంగళవారం 41.36 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 99.12 కోట్లకు చేరింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సంఖ్య వంద కోట్ల దాటనుంది.