కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ప్రెస్: ఇద్దరు మృతి
హైదరాబాద్: కర్ణాటకలోని వాడి- గుల్బర్గా రైల్వేస్టేషన్ల మధ్యలోని మార్టూరు గ్రామం వద్ద సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు రైలు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ హైదరాబాద్కు చెందిన వారే.
ఈ రైలు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన జ్యోతి, లక్ష్మీలు మరణించారు. ఈ ఘటనలో సల్మా, రాజు, శ్రీకాంత్లు గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రయాణికులు సికింద్రాబాద్లో రైలు ఎక్కారని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ముంబైకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆంబులెన్సుల ద్వారా గుల్బర్గా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్-ముంబై దురంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి 11.05 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. ప్రమాద సమయంలో గంటకు 110 కిమీ వేగంలో రైలు నడుస్తుందని అధికారులు చెప్పారు.
తెల్లవారుజామున 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. రైళ్ల రాకపోకల సమాచారం తెలిపేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి తలా రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె. మిట్టల్ తెలిపారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. ఈ ఘోరం ఎలా జరిగిందనేదానిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు మిట్టల్ పేర్కొన్నారు. రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్-బీజాపూర్ ప్యాసింజరు, ముంబై- సికింద్రాబాద్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. ఫలక్నుమా- గుల్బర్గా ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేశారు.
రైల్వే
హెల్ప్లైన్
నెంబర్లు
సికింద్రాబాద్
హెల్ప్లైన్
నెం.
040-27700868
హైదరాబాద్
హెల్ప్లైన్
నెం
040-23200865
వికారాబాద్
హెల్ప్లైన్
నెం
08416-
252103
తాండూరు
హెల్ప్లైన్
నెం
08411-272010
గుల్బర్గా
హెల్ప్లైన్
నెం.08472-255966
Saddened
by
Duranto
accident.Ordered
enquiry.Immediate
medical
relief&
other
assistance
rushed.Chair
Rail
board
asked
to
rush.
—
Suresh
Prabhu
(@sureshpprabhu)
September
12,
2015
All
injured
bring
rushed
to
hospitals
and
treated
by
medical
team.We
give
ex
gratia
to
injured,unfortunate
families
of
dead.monitoring
it
—
Suresh
Prabhu
(@sureshpprabhu)
September
12,
2015
All
possible
assistance
is
provided
to
all
affected,
all
being
rescued.Very
unfortunate
for
this.Cause
investigated
to
take
action
—
Suresh
Prabhu
(@sureshpprabhu)
September
12,
2015
All
7
injured
rushed
to
civil
hospital,
treatment
on,rail
doctors
r
on
job.All
arrangements
made
to
take
others
to
destination,special
train
—
Suresh
Prabhu
(@sureshpprabhu)
September
12,
2015
All
possible
help
being
provided
to
affected
families
and
passengers.Chairman
Rail
Board,
GM,
DRM,
all
orders
to
be
on
rescue
job
—
Suresh
Prabhu
(@sureshpprabhu)
September
12,
2015