వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్: ఇద్దరు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్ణాటకలోని వాడి- గుల్బర్గా రైల్వేస్టేషన్ల మధ్యలోని మార్టూరు గ్రామం వద్ద సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు రైలు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారే.

ఈ రైలు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, లక్ష్మీలు మరణించారు. ఈ ఘటనలో సల్మా, రాజు, శ్రీకాంత్‌లు గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రయాణికులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి ముంబైకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

 Duronto Express derails in Karnataka

క్షతగాత్రులను ఆంబులెన్సుల ద్వారా గుల్బర్గా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్-ముంబై దురంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి 11.05 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. ప్రమాద సమయంలో గంటకు 110 కిమీ వేగంలో రైలు నడుస్తుందని అధికారులు చెప్పారు.

తెల్లవారుజామున 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. రైళ్ల రాకపోకల సమాచారం తెలిపేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి తలా రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె. మిట్టల్ తెలిపారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. ఈ ఘోరం ఎలా జరిగిందనేదానిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు మిట్టల్ పేర్కొన్నారు. రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్‌-బీజాపూర్‌ ప్యాసింజరు, ముంబై- సికింద్రాబాద్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఫలక్‌నుమా- గుల్బర్గా ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేశారు.

రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్లు
సికింద్రాబాద్‌ హెల్ప్‌లైన్‌ నెం. 040-27700868
హైదరాబాద్ హెల్ప్‌లైన్‌ నెం 040-23200865
వికారాబాద్ హెల్ప్‌లైన్‌ నెం 08416- 252103
తాండూరు హెల్ప్‌లైన్‌ నెం 08411-272010
గుల్బర్గా హెల్ప్‌లైన్‌ నెం.08472-255966

English summary
Two passengers were killed and eight others injured as the Duronto AC Express train going from Secunderabad to Mumbai derailed at Martur near Kalburgi in Karnataka. The accident is reported to have occurred around 2 am. Nine coaches of the train had jumped off the tracks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X