మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2కొత్త పింఛన్లు: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అనేక హామీలను ఇస్తున్నాయి. హామీల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. కాగా, టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు కొత్త పింఛన్లను డిసెంబర్ 11 తర్వాత అధికారంలోకి వచ్చే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
60-55ఏళ్లకు తగ్గింపు
యాదాద్రిలో
నిర్వహించిన
సభలో
ప్రజలనుద్దేశించి
కేటీఆర్
మాట్లాడుతూ..
వచ్చే
టీఆర్ఎస్
ప్రభుత్వం
వృద్ధులకు
రూ.2,016
పింఛను
ఇవ్వనుందని
తెలిపారు.
అంతేగాక,
వృద్ధాప్య
పింఛను
అర్హత
వయస్సును
60ఏళ్ల
నుంచి
55కు
తగ్గించనున్నట్లు
తెలిపారు.
కేసీఆర్ ‘నీళ్లు' కావాలా? కూటమి ‘కన్నీళ్లు' కావాలా?: కేటీఆర్
దివ్యాంగులకు, నిరుద్యోగుల పింఛన్లు..
ఇక దివ్యాంగులకు ఇచ్చే పింఛనును రూ.3,016కు పెంచనున్నట్లు కేటీఆర్ చెప్పారు. అంతేగాక, సుమారు 10లక్షల నిరుద్యోగ యువతకు రూ.3,000ల పింఛను ఇవ్వనున్నట్లు తెలిపారు.
24గంటల కరెంటు.. కాంగ్రెస్ 6గంటలే..
గతంలో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6గంటలు మాత్రమే ఇచ్చిందని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం 24గంటలపాటు ఉచిత కరెంటు అందిస్తోందని తెలిపారు. అంతేగాక, 17వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిందని కేటీఆర్ తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు 200కేసులు
మరోసారి
కేసీఆర్
మళ్లీ
అధికారంలోకి
వస్తే
రూ.లక్ష
రైతు
రుణ
మాఫీ
చేస్తామని,
రైతు
బంధు
పథకాన్ని
ఎకరాకు
రూ.10వేలకు
పెంచుతామని
చెప్పారు.
తెలంగాణలో
జరుగుతున్న
అభివృద్ధిని
అడ్డుకునేందుకు
కాంగ్రెస్
పార్టీ
సుమారు
200కేసులు
వేసిందని
కేసీఆర్
తెలిపారు.
చనిపోయిన
వ్యక్తులతో
కూడా
ఈ
కేసులు
వేయించారని
మండిపడ్డారు.