వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

219 మందికి పాజిటివ్, తెలంగాణలో కరోనా కలవరం, బల్దియా పరిధిలోనే 189..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. సోమవారం కూడా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ సెంచరీ దాటిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 5 వేల 193కి చేరింది. వైరస్ తగ్గి 2766 మంది డిశ్చార్జి కాగా.. 2240 మందికి చికిత్స అందిస్తున్నారు. సోమవారం కూడా వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 187కి చేరింది.

 219 positive cases register in telangana

Recommended Video

Telangana సబ్ ఇన్స్పెక్టర్ Unique Drill Session వీడియో Gone వైరల్

కరోనా వైరస్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. 189 కేసులు బల్దియా పరిధిలోనే వెలుగుచేశాయి. రంగారెడ్డి జిల్లాలో 13 మంది, వరంగల్ అర్బన్ నలుగురు, వరంగల్ రూరల్‌లో ముగ్గురికి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాలో ఒక్కరికి వైరస్ సోకింది. కరోనా వైరస్ మొత్తం కేసులు 5 వేల 193 కాగా.. 4 వేల 744 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా.. 449 మంది వలసకూలీలు, విదేశాల నుంచి వచ్చినవారు అని బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

English summary
219 positive cases register in telangana, 189 cases found in ghmc.. 2 people are dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X