ప్రేమ్జీ వర్సిటీలో 30 సీట్లలో 22 గురుకుల్వే
హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల సంస్థలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు రికార్డ్ సృష్టించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్న బెంగళూరులోని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలో 22 సీట్లను గురుకుల విద్యార్థులు దక్కించుకున్నారు.
దేశవ్యాప్తంగా వందమంది విద్యార్థులకు 2015-18 సంవత్సరంలో ప్రవేశం ఉంటుంది. అయితే, అందులో 30 సీట్లలో విద్యార్థులకు ఉచితంగా గురుకుల విధానంలో బోధిస్తారు. ఈ ముప్పై సీట్లలో 22 సీట్లను ఎస్సీ గురుకుల విద్యార్థులు దక్కించుకోవడం గమనార్హం.
ఈ 22 సీట్లలో కూడా 12 సీట్లు అమ్మాయిలకే దక్కాయి. మూడేళ్ల బీఏ(ఎకనామిక్స్), బీఏ(పాలిటిక్స్), బీఏ(కంబైన్డ్ హ్యూమనిటీస్, హిస్టరీ, లిటరేచర్, ఫిలాసపీ), బీఎస్సీ (బయాలజీ, ఫిజిక్స్)లలో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు జరిగాయి.
ఎస్సీ గురుకులం విద్యార్థులు అరుదైన రికార్డ్ నెలకొల్పారు. దేశంలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఒకటి. ఇందులో ప్రవేశాలలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటారు. ఇలాంటి విశ్వవిద్యాలయంలో 30 మందికి గాను 22 మంది విద్యార్థులు ఎస్సీ గురుకులం విద్యార్థులే.