కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 226 కేసులు... దేశంలో కొత్తగా 15,223 కేసులు
తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొకరు కరోనాతో మృతి చెందారు. మరో 714 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (జనవరి 21) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
షాకింగ్ : నిర్మల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మృతి...
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1584కి చేరింది. ప్రస్తుతం 3920 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2322 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,87,117కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 31,647 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,74,184కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 2,03,497 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.7శాతం ఉండగా తెలంగాణలో 98.11 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 కేసులు మోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15,223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883కు చేరింది.మరో 151 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,869కు పెరిగింది. గడిచిన 24గంటల్లో మొత్తం 19,965 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,02,45,741కి చేరింది. ప్రస్తుతం 1,92,308 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24గంటల్లో 7,80,835 కరోనా టెస్టులు చేయగా... ఇప్పటివరకూ చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 18,93,47,782కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 8,06,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.