వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ లక్ష: కరోనా విలయం, 24 గంటల్లో 2474 కేసులు, ఏడుగురి మృతి..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 24,004 మందికి పరీక్షలు చేయగా 2474 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరింది. రాష్ట్రంలో వైరస్ సోకిన మొత్తం సంఖ్య లక్ష వెయ్యి 865 మందికి చేరింది. కరోనా వైరస్ నుంచి 1768 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న మొత్తం సంఖ్య 78 వేల 735కి చేరింది.

Recommended Video

COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!

ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల 386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో ఏడుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 744కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 91 వేల 173 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో కేసులు మళ్లీ పెరిగాయి. 447 మందికి కరోనా వైరస్ సోకింది.

2474 corona cases register in telangana state..

రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య 15,933గా ఉంది అని వైద్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 24,004 శాంపిల్స్ సేకరించగా... అందులో 1239 కేసుల ఫలితాలు రావాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలో 91 కేసులు, ఖమ్మం 125, మేడ్చల్ మల్కాజిగిరి 149, నల్గొండ 122, నిజామాబాద్ 153, రంగారెడ్డి 201, సిద్దిపేట 92, వరంగల్ అర్బన్ 123 కేసుల చొప్పున వచ్చాయి.

English summary
2474 coronavirus cases register in telangana state. total cases reached one lakh. last 24 hours 7 people are dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X