ప్రియుడిని కలువొద్దన్నందుకు భర్తను చంపిన భార్య, కనిపించడం లేదని డ్రామా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లో దారుణ జరిగింది. ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టి మూసినదిలో పడేశారు. మృతుడిని శివరాంపల్లికి చెందిన ఆనంద్గా గుర్తించారు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు నెలల క్రితం భర్తను చంపేసింది.
స్టార్ హోటల్లో సెక్స్ రాకెట్, అలా దొరికారు: ఇద్దరు డ్యాన్సర్లు, విద్యార్థి అరెస్ట్
ఆ తర్వాత మూసినదిలో పడేసి, రెండు మూడు రోజుల తర్వాత పోలీసులకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరిపారు. కానీ ఎక్కడా క్లూ దొరకలేదు. దీంతో వారు భార్యను అనుమానించారు. ఆ దిశగా దర్యాఫ్తు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
వివాహేర సంబంధానికి అడ్డు వస్తున్నాడని
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే ప్రియుడితో కలిసి హత్య చేసింది. కేసు మిస్టరీ దాదాపు మూడు నెలల తర్వాత వీడింది. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్పేట మండలం లింగపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, మహేశ్వరిలకు పెళ్లయింది. వారు ఎనిమిదేళ్లుగా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్నారు.
సంబంధంపై భార్యాభర్తల మధ్య గొడవ
ఆనంద్ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. మహేశ్వరి ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్వరికి గండిపేట మండలానికి చెందిన ఆటో డ్రైవర్ సంజీవ్తో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు పెళ్లికి ముందు నుంచే అతను పరిచయంగా తెలుస్తోంది. సంజీవ్తో సంబంధం విషయం తెలిసిన భర్త.. భార్యను నిలదీసేవాడు. దీనిపై ఇరువురి మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి.
అడ్డు వస్తున్నాడని హత్యకు ప్లాన్
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆగ్రహించిన మహేశ్వరి భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే 7వ తేదీన రాత్రి ఆనంద్ మద్యం తాగి నిద్రపోయాడు. అదే అదనుగా భావించిన మహేశ్వరి ప్రియుడు సంజీవ్ను పిలిపించింది. ఇద్దరు కలిసి ఆనంద్ గొంతుకు తీగ చుట్టి హత్య చేశారు.
ఆ తర్వాత భర్త కనిపించడం లేదని డ్రామా
ఆ తర్వాత శవాన్ని సంజీవ్ తన ఆటోలో వేసుకొని గంధంగూడ సమీపంలోని తనకు చెందిన స్థలంలోనే పడేసి పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 20న ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు ఆ తర్వాత భార్యపై అనుమానంతో ఆ కోణంలో దర్యాఫ్తు చేయడంతో విషయం బయటపడింది. మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతాన్ని మంగళవారం రాజేంద్రనగర్ పోలీసులు పరిశీలించారు. అక్కడి ఎముకలను సేకరించి డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు.