తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. శనివారం 31 కేసులు నమోదు కాగా, తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఆదివారం నమోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 751 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 415 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, కుమురంభీం అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, నిర్మల్ జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.