వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఎన్ఆర్ఐ సుహసిని మృతి, 7 ఏళ్ళ కొడుకు సురక్షితం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో ఇండియాకు చెందిన కేశపల్లి సుహసిని మరణించింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆమె ఏడేళ్ళ కొడుకు సరక్షితంగా బయటపడ్డాడు.సుహసిని మృతదేహన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

హోండా సివిక్ కారులో న్యూ టంపా రోడ్డు మీదుగా సుహసిని ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. సుహసిని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఆమె ఏడేళ్ళ కొడుకు సుచీర్ బొజ్జ స్వల్పగాయాలతో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. స్థానికులు అతడిని టంపా ఆసుపత్రికి తరలించారు.ఒక్కరోజు చికిత్స తర్వాత సుచీర్ బొజ్జను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. లేక్‌ల్యాండ్ నుండి ఇటీవలే సుహసిని కుటుంబం టంపాకు వచ్చినట్టు సుహసిని భర్త సురేష్ చెప్పారు.

34-year-old Telugu mother dies in car crash in Tampa, Florida

సుహసిని స్నేహితులు విరాళాల వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో సుహసిని చురుకుగా పాల్గొన్నారని స్నేహితులు గుర్తుచేస్తున్నారు.
సుహసిని సహకారంతోనే ఈ విరాళాల సేకరణ ఊపందుకొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

నార్త్ అమెరికన్ తెలుగు సోసైటీ, ఆమె స్నేహితులు సుహసిని భౌతికకాయాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం గత శుక్రవారం నాడు చోటుచేసుకొంది.

English summary
A 34-year-old Telugu NRI, identified as Suhasini Keshapally, was killed on Friday after she lost control of her car while driving with her seven-year-old son on Morris Bridge Road in Tampa of Florida, United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X