వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: మరో 52 కేసులు నమోదు, ఒకరి మృతి, తెలంగాణలో 18కి చేరిన మృతుల సంఖ్య..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంగళవారం 52 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరుకున్నది.

మంగళవారం ఏడుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకరు వైరస్ సోకి చనిపోయారని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. కరోనా వైరస్ సోకి మంగళవారం ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 110 మంది కాగా.. 516 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

52 new corona positive cases found in telangana state

దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 20వ తేదీ తర్వాత ఆంక్షలను సడలిస్తామని.. ఈ మేరకు బుధవారం గైడ్ లైన్స్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఏప్రిల్ 14వ తేదీన లాక్ డౌన్ గడువు ముగియనుండగా..ఇప్పటికే తెలంగాణ రాష్రం లాక్ డౌన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రధాని మోడీ.. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోందని స్పష్టచేశారు.

English summary
52 new corona positive cases found in telangana state. total cases are 644 state health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X