593 కేసులు: 3 మృతి.. 2 లక్షల 69 వేలు దాటిన పాజిటివ్ కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల రోజూ 4 నుంచి 500 పాజిటివ్ కేసుల వరకు వస్తున్నాయి. వైరస్ వచ్చి కోలుకున్న వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటోంది. అయితే శీతాకాలం కావడంతో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచించడం కాస్త భయాందోళన నెలకొంది.
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 593 కరోనా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 69 వేల 816కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 58 వేల336కి మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ముగ్గురు కరోనా వైరస్ సోకిన వారు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,458కి చేరింది.
గత 24 గంటల్లో 1,058 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 10 వేల637 మంది కరోనా వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 8,459 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. గ్రేటర్ పరిధిలో కొత్తగా 119 కరోనా కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదివరకు మెజార్టీ కేసులు గ్రేటర్ పరిధిలోనే వచ్చాయి. అయితే ప్రస్తుతం బల్దియా ఎన్నికల నేపథ్యంలో జోరుగా క్యాంపెయిన్ చేశారు. దీంతో వైరస్ మరింత విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది.