వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌టిసి బస్సు, లారీ ఢీ 6 మృతి, 15 మందికి గాయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

6 killed, 15 injured in road mishap

ఆర్టీసీ బస్సు అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కనే పంక్చర్‌ కావడంతో లారీ టైర్‌ను డ్రైవర్ మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.

లారీని గమనించకుండానే ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాహనాన్ని నడిపాడు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. లారీని వెనకవైపు నుంచి వేగంగా బస్సు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ లారీ కిందే చనిపోయాడు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు.క్షతగాత్రులను కోదాడ, సూర్యపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
6 killed in road accident at Maddelacheruvu village in Suryapet district. Apsrtc bus and lorry crashes at Moddulachervu village. 6 dead including lorry driver, 15 members injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X