7 నెలల గర్భిణీకి కరోనా వైరస్, యాదాద్రి జిల్లాలో కలకలం, భువనగిరి ఎయిమ్స్లో చికిత్స...
కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నా.. సరే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. యాదాద్రి భువనగరి జిల్లాలో ఓ గర్బిణీకి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది. ఆమె ఇటీవలే గ్రామానికి వచ్చిందని.. వేరే జిల్లాలో వైరస్ సోకి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన వలసకూలీకి వైరస్ సోకింది. అయితే ఆమె 7 నెలల గర్భిణీ కాగా.. వైరస్ ఉంది అని నిర్ధారణ అయ్యింది. గర్బిణీ ఇటీవలే గ్రామానికి వచ్చిందని తెలిపారు. కుటుంబసభ్యులను బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్కు వెళ్లిందని... అయితే పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణీ అని వైద్యులు తెలిపారు. జాగ్రత్తగా వైద్యం అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మరోవైపు సంస్థాన్ నారాయణపురం, జనగాం గ్రామాల్లో గర్భిణీ ఎవరినీ కలిసింది, కాంటాక్ట్లో ఉన్న వారి వివరాలను అధికారులు ఆరాతీస్తున్నారు. వైరస్ విస్తరిస్తోన్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.