ఇటలీ నుంచి తీసుకొస్తే ఢిల్లీలో తప్పించుకున్న నిందితుడు: హైదరాబాద్ సీపీ సీరియస్
హైదరాబాద్: ఓ నిందితుడు పారిపోవడానికి అవకాశం కల్పించిన నగర పోలీసులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ఓ కేసులో నిందితుడైన బ్రిటీష్ జాతీయుడు మహ్మద్ అలీవర్ను ఇటలీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్కు వచ్చారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మహ్మద్.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ కమిషనర్ సీరియస్గా స్పందించారు.
నిందితుడు మహ్మద్ పారిపోవడానికి అవకాశం కల్పించిన సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టినట్లు సమాచారం.
Comments
English summary
A accused escaped in Delhi railway station from Telangana Police.
Story first published: Thursday, April 13, 2017, 15:51 [IST]