ఘోరం: ఇంటిముందు నిలబడిన విద్యార్థినిని ఎత్తుకెళ్లి రేప్
ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఒక వివాహితుడైన యువకుడు శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో నిలబడి ఉన్న బాలికను బలవంతంగా లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం తనకు అనారోగ్యంతో ఉండటంతో బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. గ్రామంలోనే ఓ చోట పని చేస్తున్న తన తల్లి వద్దకు వెళ్లొస్తూ తమ ఇంటి సమీపంలో రహదారిపై నిలబడింది. దీన్ని గమనించిన మల్లెబోయిన సురేందర్రావు అనే వ్యక్తి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.
బాలిక
కేకలు
పెట్టకుండా
నోటిని
చేతితో
మూసేసి...
అఘాయిత్యానికి
పాల్పడ్డాడు.
ఆ
తర్వాత
విద్యార్థిని
కేకలు
పెట్టడంతో...
విని
వచ్చిన
ఆమె
తల్లిని
చూసి
నిందితుడు
పరారయ్యాడు.
బాధితురాలి తల్లి కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇంఛార్జి ఎస్ఐ ఎంఏ రవూఫ్ తెలిపారు. నిందితుడు వివాహితుడు కాగా, భార్య నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.